కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుది ఎన్నికల ఎజెండా, జగన్‌ది ప్రజా సమస్యల ఎజెండా: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు/కర్నులు: చిరంజీవి పార్టీ పెట్టి ఎన్నికల కోసం చూశారని, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ పెట్టకముందే ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు బుధవారం గుంటూరులో చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని భక్షించాలని చూస్తుందన్నారు. గత సాధారణ ఎన్నికలలో మూడో స్థానానికి పడిపోయిన చిరంజీవితో కాంగ్రెసు ఎలా బలపడుతుందని అధిష్టానం భావిస్తుందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్సుమెంటుపై జగన్ చేస్తున్న దీక్షకు భారీగా విద్యార్థులు తరలి వస్తారని చెప్పారు.

కాంగ్రెసు ఎంతమందిని కలుపుకున్నా అది బలపడదని, అలాగే జగన్‌నుండి ఎంత మందిని చీల్చినా ఆయన బలహీనపడరని చెప్పారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని దివంగత ఇందిరాగాంధీ శవం పక్కన ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా చేశారని అది ఎవరికీ గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. కాగా కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో
విమర్శించారు.

English summary
YS Jagan camp leader Ambati Rambabu said that Chiranjeevi's agenda is power. Ex Minister Mareppa said that Congress will not get deposits although contest AICC president Sonia Gandhi and AICC General Secretary in Kadapa and Pulivendula by election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X