చిరుది ఎన్నికల ఎజెండా, జగన్ది ప్రజా సమస్యల ఎజెండా: అంబటి

కాంగ్రెసు ఎంతమందిని కలుపుకున్నా అది బలపడదని, అలాగే జగన్నుండి ఎంత మందిని చీల్చినా ఆయన బలహీనపడరని చెప్పారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని దివంగత ఇందిరాగాంధీ శవం పక్కన ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా చేశారని అది ఎవరికీ గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. కాగా కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో
విమర్శించారు.












Click it and Unblock the Notifications