వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు రక్షిస్తున్నాడు: జెసి దివాకర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే రక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి శనివారం అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలో ఉందని, ఇలాంటి సమయంలో అవిశ్వాసం పెట్టే అవకాశం టిడిపికి ఉందన్నారు. అయితే చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని రక్షిస్తున్నారన్నారు. ఆయన అవిశ్వాసం పెడితే ప్రభుత్వం మనుగడ తేటతెల్లమవుతుందని అన్నారు. ప్రభుత్వం మనుగడ బాల్ వారి కోర్టులోనే ఉందని చెప్పారు.

చంద్రబాబు ఇటు తెలంగాణను సమర్థించకుండా, అటు సమైక్యాంధ్ర అనకుండా ఉండటం వల్ల రెండు ప్రాంతాల్లో టిడిపికి నష్టం వాటిల్లుతుందన్నారు. ఆయన ఇప్పటికైనా సమైక్యాంధ్ర అంటే కనీసం సీమాంధ్రలోనైనా టిడిపి పార్టీ బతుకుందన్నారు. టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే బాబు నాయకత్వానికి తిరుగు ఉండేది కాదన్నారు.

English summary
Ex Minister JC Diwakar Reddy said TDP president Chandrababu protecting Congress government. He suggest Chandrababu if he commit for United Andhra TDP will survive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X