హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ వాయిదా పడినా సభలోనే బైఠాయించిన తెరాస ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్‌: పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని కోరుతూ తీర్మానం ప్రతిపాదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు బుధవారం కూడా శాసనసభా కార్యక్రమాలు స్తంభింపజేశారు. దీంతో శాసనసభను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రెండు సార్లు సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా తెరాస సభ్యులు సభలోనే బైఠాయించి తమ నిరసన తెలిపారు.

బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అయితే, తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాల్సిందేనంటూ తెరాస సభ్యులు పట్టుబట్టారు. తెలంగాణ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను డిప్యూటీ స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తెరాస శాసనసభ్యులు తెలంగాణ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంతగా సర్గి చెప్పినా వారు వినలేదు. దీంతో ఆయన సభను మరోసారి వాయిదా వేశారు.

English summary
Deputy speaker Nadendla Manohar adjourned twice today as TRS MLAs stall proceedings on Telangana issue. TRS MLAs demanded to propose Telangana resolution in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X