వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెసు ఎంపీలకు వీరప్ప మొయిలీ హెచ్చరికలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ‌: తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో భేటీ అయిన తర్వాత ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లోకసభలో ప్రతిపక్షాలతో కలిసి తెలంగాణ సభ్యులు తెలంగాణపై గొంత విప్పడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. లోకసభలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు గొడవ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. గందరగోళం సృష్టిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు.

తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అందరూ ఆమోదించే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు అన్ని పార్టీలూ కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

English summary
AICC Andhrapradesh incharge Veerappa Moily expressed anguish at party Telanagna region MPs for giving slogans in Lokasabha. He warned that action will be taken, if party MPs repeat the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X