రాష్ట్ర బడ్జెట్ మేడిపండులా ఉంది: టిడిపి అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వడం కాదని, క్వాలిటీ విద్యుత్ ఇవ్వడం కావాలన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం చాలా వెనుక బడి ఉందన్నారు.కిలో బియ్యం 2 రూపాయలకు ఇస్తామని చెప్పారు, కానీ ఎంత ఇస్తున్నారు, ఎలాంటి బియ్యం ఇస్తున్నారో గుర్తుంచుకోవాలన్నారు. కందిపప్పు ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదన్నారు. ఆహార భద్రతకు, శాంతి భద్రతల సమస్యలపై ఊసే లేదన్నారు. అవినీతి గురించి కూడా ప్రస్తావించలేదన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువమంది ఆధారపడిన పరిశ్రమ చేనేత అని, అయితే దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
బడ్జెట్లో చేనేత గురించి ప్రస్తావనే లేక పోవడం శోచనీయమన్నారు. జలయజ్ఞాన్ని రాష్ట్రానికి గుదిబండలా తయారు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఇదివరకే చెప్పిందన్నారు. ఇప్పుడు పరిస్థితి అలాగే తయారయిందన్నారు. ఐటి వల్ల లాభాలు వస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారని, అయితే ఆ ఐటిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలన్నారు. లాభం వస్తుందన్న ఐటికి మాత్రం ప్రభుత్వం కేటాయింపులు సరిగా లేవన్నారు. విద్యార్థులకు ఫీజులు ఎలా చెల్లిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు.