హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా గాంధీకి తెలంగాణ మంత్రుల లేఖ: సంతకాల సేకరణ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో కేంద్రం తరఫున హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని కోరుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 2009 డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందని దానికి కట్టుబడి కేంద్రం, కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుతూ వారు సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రుల సంతకాలను ఓ లేఖపై సేకరిస్తున్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు లేఖలో కోరునున్నట్లుగా తెలుస్తోంది.

కాగా ముసాయిదా బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ముందువరుసలో కూర్చోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కిరణ్‌కకుమార్ రెడ్డికి ఇది తొలి బడ్జెట్, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతారు. ధర్మాన ప్రసాదరావు శాసనమండలిలో ప్రవేశ పెడతారు. ఈ ముసాయిదా బడ్జెట్ లక్షా 28వేల కోట్ల రూపాయలు కాగా, గత ఏడాది లక్షా 13వేల కోట్ల రూపాయలు. అయితే ఉద్యోగుల జీతాలకే ఇందులో ఎక్కువ వెళ్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

English summary
Telangana Ministers are writing a letter to AICC president Sonia Gandhi, suggesting to commit december 9th statement on Telangana issue. They are taking signatures of all Telangana ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X