వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మణుగూరు ట్రెయిన్‌కు నిప్పు: పరుగులు తీసిన ప్రయాణీకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
వరంగల్: జిల్లాలోని కేసముద్రం వద్ద మణుగూరు రైలుకు కొందరు దుండగులు పెట్రోలు పోసి తగలబెట్టిన సంఘటన బుధవారం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ - భద్రాచలం మధ్య నడుస్తున్న మణుగూరు ప్యాసింజర్ నడుస్తుంది. అయితే కొందరు దుండగులు ఏడో నెంబరు బోగీపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. దీంతో ఆ బోగీ పూర్తిగా దగ్ధమయ్యింది. మరో నాలుగు బోగీలకు ఈ మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా కేసముద్రం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏడో నెంబరు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

కాగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 48 గంటల బంద్ పిలుపులో భాగంగా బుధవారం రెండోరోజు బంద్ కొనసాగుతోంది. అయితే బంద్ ఉన్న సమయంలో కూడా రైలు నడపడాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా తెలంగాణవాదులు రైలుకు నిప్పు పెట్టారా లేదా ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంలో భాగంగా కొందరు దుండగులు దీనికి పాల్పడ్డారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Unknown persons set fired to manuguru train at Kesamudram of Warangal district on wednesday. One bogie destroyed completely and fire extended to another four bogies. Passengers run away with fear from train. Manuguru train travels between Hyderabad and Badrachalam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X