అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల పాదయాత్ర

ఫీజు రీయంబర్స్మెంట్ విడుదలకు డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన వైయస్ జగన్ దీక్ష బుధవారానికి ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని జగన్ వర్గం శాసనసభ్యులు విమర్శించారు. వైయస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ప్రభుత్వానికి తన నిరసనను తెలిపేందుకే నల్లబ్యాడ్జీలు ధరించి పాదయాత్ర చేపట్టామని వారు చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే 24వ తేదీన విద్యార్థులతో సహా తాము శాసనసభను ముట్టడిస్తామని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications