కాంగ్రెసు ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం: కోదండరామ్

సహాయ నిరాకరణకు సంఘీభావంగా ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణలోని జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రైల్ రోకో తేదీలను రేపు ఉదయం ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన తెలంగాణ శాసనసభ్యుల వైఖరిని నిలదీస్తూ, వారిని ఎండగడుతూ జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో మీడియా సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ్యుల వైఖరే అవరోధంగా మారిందని ఆయన విమర్శించారు.
శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి నివేదిక రాయాలో అలాంటి నివేదిక రాయలేదని హైకోర్టు న్యాయమూర్తే వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలు సంతృప్తి చెందుతారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్దత లేదని అటార్నీ జనరలే స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications