వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలో మళ్లీ తెలంగాణం: పోడియం దగ్గరకు కెసిఆర్, రాములమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: పార్లమెంటులో గురువారం కూడా తెలంగాణ నినాదాలు మారుమ్రోగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉదయం స్పీకర్ మీరాకుమార్‌కు తెలంగాణపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకరు అనుమతించకుండా, జీరో అవర్‌లో మాట్లాడటానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అయితే ఈరోజు చర్చించాల్సేందేనని పట్టుబడుతూ టీఅర్ఎస్ ఎంపీలు కెసిఆర్, విజయశాంతి పెద్దగా తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. వారికి ఎన్డీయే పక్షాలు మద్దతు పలికాయి. తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా తెలంగాణ కోసం పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పరిస్థితి విషమించడంతో స్పీకర్ మీరాకుమార్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. సభ ప్రారంభం అయిన మూడు నిమిషాలలోనే సభ వాయిదా పడింది.

తెలంగాణపై చర్చకు పట్టుబడుతూ బుధవారం పోడియం వద్దకు కెసిఆర్, విజయశాంతి రెండో రోజూ పోడియం వద్దకు దూసుకు పోయారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ పోడియం వద్ద బైఠాయించారు. కాగా ఈ నెల 28న బడ్జెట్ సమావేశాల అనంతరం తెలంగాణపై స్పష్టమైన హామీ ఉంటుందని అధిష్టానం హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ ఎంపీలు మాత్రం వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది.

English summary
Telangana slogans repeated in Parliament on thursday also. TRS MPs K Chandrasekhar Rao and Vijayashanthi sat at speaker's podium. speaker adjourned parliament for 15 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X