సోనియాను కలవనున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సహాయ నిరాకరణ, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను ఆయన సోనియా దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలను కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం దృష్టికి తెచ్చే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు తమ పరిశీలనలో ఉన్న పేర్లతో ఒక జాబితాను ఆయన అధిష్టానం వద్దకు తీసుకువెళ్లారు. కాగా ఎమ్మెల్సీ స్థానాల విషయమై శుక్రవారం పలువురు నేతలు సీఎంను కలిశారు.

తెలంగాణ డిమాండ్‌తో పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ మంత్రులు సైతం ఢిల్లీ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న ఢిల్లీ నేతలు.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో కిరణ్‌కు సూచించనున్నారు. ముందుగా సొంతపార్టీ నిరసనల సెగను తగ్గించేందుకు రాజకీయ వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ సీఎం పదవిని భర్తీచేసే దిశగా అధిష్టానం చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డిలు ఈ పదవిని ఆశిస్తుండగా రాజనర్సింహవైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా కిరణ్ కేబినెట్లోని పలువురు మంత్రులు తమ శాఖలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ల మద్దతు పొందేందుకు వీలుగా మంత్రివర్గంలో మార్పులుచేర్పులపై కూడా అధిష్టానం కిరణ్‌కు ఆదేశాలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు కీలకమైన శాఖలు తెలంగాణాకే కేటాయించే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగానే ఈ మార్పులు జరగవచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+