హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ అక్రమాలపై జెఎల్‌పి: టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపైన ప్రభుత్వం దృష్టి సారించాలని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ డిమాండ్ చేశారు. సాక్షిలోకి వచ్చినవన్నీ దొంగ పెట్టుబడులు అని ఐటి శాఖ తేల్చి చెప్పిందని అన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటానికి గల కారణమేమిటని ఆయన ప్రశ్నించారు.

జగన్ అక్రమాస్తులపైన ఎంక్వయిరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా జగన్ అక్రమాలపై పార్లమెంటులో జెపిసి మాదిరిగా ఇక్కడ జాయింట్ లెజిస్ట్రేటివ్ కమిటీ వేయాలని అన్నారు. జగన్ ఆస్తులపై ప్రభుత్వం జెఎల్‌పి వేయకుంటే శాసనసభా సమావేశాలను స్థంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని అన్నారు.

English summary
TDP senior MLA Devineni Umamaheshwara Rao demanded government Joint Legistrative Committee on YS Jaganmohan Reddy corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X