అద్వానీపై చంద్రబాబు వ్యాఖ్య, బిజెపి నేత కిషన్ రెడ్డి ధ్వజం

Kishan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదని తమ పార్టీ నేత ఎల్‌కె అద్వానీ అన్నారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ అంశంపై శాసనసభ సోమవారం ఉదయం 15 నిమిషాల పాటు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణను అడ్డుకున్నదెవరో అద్వానీ చెప్పారని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు రెండు కళ్లు గుడ్డివి అవుతాయని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు వద్దని అద్వానీ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం వల్ల ప్రత్యేక పరిస్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణపై సబ్ కమిటీ వేసి అధ్యయనం చేసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిందని, ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇచ్చారని, పార్టీ మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకున్నారని, ఇంత చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్రం చెప్పగానే యూ టర్న్ తీసుకున్నారని ఆయన వివరించారు. తెలంగాణపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలమా, కాదా చెప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పదో తరగతి పరీక్షలకు ఆటంకం కలగకుండా చూస్తామని, దీనిపై తెలంగాణ జెఎసితో మాట్లాడుతామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+