విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చిలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన!: మంత్రి శంకరరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
విజయవాడ: త్వరలో తెలంగాణ వచ్చి తీరుతుందని చేనేత, జౌళీ శాఖమాత్యులు శంకరరావు సోమవారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో అన్నారు. మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరిని వెలువరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చేనెలలో స్పష్టమైన వైఖరి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెసు పార్టీపైన తెలంగాణ ఇస్తారని నమ్మకముందని చెప్పారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని పలువురు చెప్పిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాల వచ్చే అవకాసమే లేదన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా తిరిగి మళ్లీ కాంగ్రెసు పార్టీలోకి వస్తారని ఆయన ఆసాభావం వ్యక్తం చేశారు.

English summary
Minister Shankar Rao hoped that the central government will give statement on Telangana issue in march. He also hoped Ex MP YS Jaganmohan Reddy will return to Congress soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X