శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన, పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి

Srikakulam District
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన ఈస్ట్ కోస్ట్ థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. ఆరుగురు గాయపడినట్లు సమాచారం. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులను ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన నాగేశ్వర రావు, బీరపువానిపేట గ్రామానికి చెందిన ఎర్రయ్యలుగా గుర్తించారు. ఈస్ట్ కోస్ట్ థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి సమీప గ్రామాల ప్రజలు పెద్ద యెత్తున ప్లాంట్ స్థలానికి దూసుకొచ్చారు. వడ్డితాండ్ర, కాకర్లపాడు గ్రామాలు కూడా ఉద్రిక్తంగా ఉన్నాయి. సోమవారం ఆకాశ లక్కవరం గ్రామ ప్రజలు ప్లాంట్ వైపు దూసుకొచ్చారు.

ప్లాంట్ వైపు దూసుకొస్తున్న ప్రజలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. పోలీసులు ప్రయోగించిన బుల్లెట్లకు దాదాపు 155 గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. పోలీసుల చర్యను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సహా ప్రతిపక్షాల నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. ప్రజలను ఒప్పించకుండా ప్లాంట్‌ను నిర్మించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+