జెసి దివాకర్ రెడ్డికి బహిష్కరణపై నన్ను అడిగే ధైర్యం లేదు: చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి గ్రామంలో పోలీసు కాల్పులపై ఆయన ప్రభుత్వం మీద మండిపడ్డారు. కాకరాపల్లి ఘటనపై ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన అవసరముందని ఆయన అన్నారు. స్థానికులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని చెప్పారు. కాల్పుల ఘటన తనను చాలా బాధించిందని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించకుండా పోలీసులను పెట్టి ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. సోంపేట, కాకరాపల్లి ఘటనలు చూస్తే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో అర్థమవుతోందని అన్నారు. కాకరాపల్లిలో పరిస్థితి సమీక్షించేందుకు బుధవారం శ్రీకాకుళం జిల్లా వెళ్తున్నట్లు చెప్పారు. తమకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు ఆందోళనకు దిగినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications