ఎమ్మెల్సీగా రామచంద్రయ్య, రాజ్యసభకు అల్లు అరవింద్‌కు లైన్ క్లియర్

Allu Aravind
హైదరాబాద్: రాజ్యసభకు తన బావమరిది అల్లు అరవింద్‌కు లైన్ క్లియర్ చేయడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో సి. రామచంద్రయ్యకు టికెట్ ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆయన పేరు ఖరారైనట్లు చెబుతున్నారు. శాసనసభ్యుల కోటాలో ప్రజారాజ్యం పార్టీకి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెసు అధిష్టానంతో చిరంజీవికి ఒప్పందం కుదిరింది. కాంగ్రెసులో పార్టీ విలీనం జరగడానికి తగిన ఏర్పాట్లు చేయడంలో, ఆ ప్రక్రియలో పాలు పంచుకోవడంలో సి. రామచంద్రయ్య ప్రధాన పాత్ర పోషించారు. ఈ విషయంలో ఆయన చిరంజీవి వెన్నంటే ఉన్నారు. దీంతో రామచంద్రయ్యను శాసనమండలికి పంపడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, రామచంద్రయ్య రాజ్యసభకు వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఎమ్మెల్సీగా వెళ్లడానికి ఆయన ఇష్టపడతారా, లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఒప్పించేందుకు చిరంజీవి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ విలీనం తర్వాత చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వేరే రాష్ట్రం నుంచి ఆయనను రాజ్యసభకు ఎన్నిక చేయడానికి ప్రయత్నాలు సాగిస్తారని చెబుతున్నారు. రాష్ట్రం నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో అల్లు అరవింద్‌కు రాజ్యసభ టికెట్ లభించేలా ఏర్పాటు చేసుకోవాలని, అందుకు పార్టీ నాయకుల నుంచి పోటీ ఉండకూడదని చిరంజీవి భావిస్తున్నారట.

కాగా, గవర్నర్ కోటాలో కూడా ప్రజారాజ్యం పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు దక్కవచ్చునని అంటున్నారు. ఈ విషయం ఇప్పటికే చిరంజీవి గవర్నర్ నరసింహన్‌తో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ ఎక్కువగానే ఉంది. కోటగిరి విద్యాధర రావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వేదవ్యాస్, తలారి మనోహర్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+