రాజీనామాకు తెలంగాణ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధం?

రాజీనామా చేయవద్దని సహచర పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డికి సలహా ఇస్తున్నట్లు సమాచారం. అయితే, అందుకు ఆయన అంగీకరించడం లేదని చెబుతున్నారు. పదవులు వదిలి తెలంగాణ నాయకులు పది నిమిషాలు కూడా ఉండలేరని కావూరి చేసిన వ్యాఖ్య ఆయనను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు చెబుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి ఢిల్లీకి చేరనున్నారు. లోకసభలో వారు అనుసరించే వ్యూహమేమిటనేది కొద్దిసేపట్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications