డిఎంకె, కాంగ్రెసు సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన, ఢిల్లీకి బాలు

Karunanidhi
చెన్నై: శాసనసభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో కాంగ్రెసు, డిఎంకెల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. పొత్తు బెడిసికొట్టే ప్రమాదం ఏర్పడింది. దీంతో డిఎంకె నేత బాలు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకునే అవకాశం ఉంది. కాంగ్రెసుతో పొత్తుపై తమ పార్టీ ఉన్నత స్థాయి కమిటీ శనివారం నిర్ణయం తీసుకుంటుందని డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి ఎ కరుణానిధి చెప్పారు. ఇంతకు ముందు 60 సీట్లు అడిగిన కాంగ్రెసు ఇప్పుడు 63 సీట్లకు పట్టుబట్టడం సరి కాదని ఆయన అన్నారు.

తాను పోటీ చేయదలుచుకున్న నియోజకవర్గాలను కాంగ్రెసు ఎంపిక చేసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఏప్రిల్ 13వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి కాంగ్రెసు, డిఎంకె మధ్య మూడు విడతలు చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదరకపోవడంతో ప్రతిష్టంభన చోటు చేసుకుంది. కాంగ్రెసుకు 51 సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ సీట్ల సంఖ్యను 53కు కూడా పెంచడానికి సిద్ధపడింది. అయితే, అకస్మాత్తుగా తనకు కావాల్సిన సీట్ల సంఖ్యను కాంగ్రెసు పెంచేసింది. ఒప్పందం కుదురుతుందని భావించినా గులాం నబీ ఆజాద్ గురువారంనాడు కరుణానిధిని కలసుకోకుండానే ఢిల్లీకి వెళ్లిపోయారు. దీన్ని కరుణానిధి తప్పు పట్టారు.

2006 ఎన్నికల్లో డిఎంకె 132 సీట్లకు, కాంగ్రెసు 48 సీట్లకు, పిఎంకె 31 సీట్లకు, వామపక్షాలు 23 సీట్లకు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ప్రస్తుతం మిత్రపక్షాలకు అంత పెద్దయెత్తున సీట్లను వదిలేస్తే 234 సీట్లున్న శాసనసభలో తమకు పోటీ చేసే స్థానాలు 122 మాత్రమే మిగులుతాయని కరుణానిధి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+