వైయస్ జగన్ పార్టీలో 100 మంది దాకా ఎమ్మెల్యేలు: అంబటి రాంబాబు

రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ చచ్చిపోయిన పార్టీ అన్నారు. చచ్చిపోయిన కాంగ్రెసును రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్గా రానున్న గులాం నబీ ఆజాద్ కూడా బతికించలేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణంపై రాష్ట్ర ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్ మృతి అనంతరం ఇప్పుడు జగన్కు కూడా భద్రత తగ్గించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జగన్ ఏఐసిసి అధ్యక్షురాలో సోనియాగాంధీతో విభేదించినప్పటినుండి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రాజెక్టుకు వైయస్ అనుమతిచ్చారని అన్నారు. ఆయన బతికి ఉంటే బాధితులను ఒప్పించడమో లేదా ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేయడమో చేసే వారు అన్నారు.
జగన్ కాంగ్రెసు పార్టీతో వెళ్లే ప్రసక్తి లేదన్నారు. జగన్ ఖచ్చితంగా పార్టీ పెడతారని చెప్పారు. అయితే దానిపై ఇప్పుడే ఖచ్చితమైన తేదిని ప్రకటించలేమని చెప్పారు. మార్చి 7వ తేదిన జగన్ పార్టీ అనేది మీడియా సృష్టే అన్నారు.












Click it and Unblock the Notifications