తెలంగాణ కోసం టాంక్బండ్పై కెసిఆర్, జైళ్లో కోదండరాం ప్రతిజ్ఞ
కాగా పలువురు ఆందోళనకారులు అన్నమయ్య, ఎర్రాప్రగడ వంటి పలు విగ్రహాల్ని ధ్వంసం చేయడం పట్ల తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ అసంతృప్తి తెలియజేశారు. ధ్వంసం చేయడం మన సంస్కృతి కాదన్నారు. ఉద్యమంలో భాగంగా తెలంగాణకు చెడుపేరు తెచ్చే విధంగా ప్రవర్తించకూడదని ఆయన కోరారు. మార్చ్లో గద్దర్ పాలుపంచుకున్నారు. కాగా పోలీసుల అడ్డంకుల్ని అధిగమించి తెలంగాణవాదులు నిర్వహించిన మిలియన్ మార్చ్ ట్యాంక్బండ్పై చెదురుమదురు సంఘటనలు మినహాయించి ప్రశాంతంగానే ముగిసింది.
ట్యాంక్బండ్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్ని పోలీసులు మూసివేసినప్పటికి తెలంగాణ వాదులు భారీ సంఖ్యలో ట్యాంక్బండ్పైకి చేరుకుని తెలంగాణ అనుకూలంగా, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చే శారు. మిలియన్ మార్చ్ సంఘీభావం తెలుపుతూ వస్తున్న నేతల్ని అరెస్ట్ చేసినవారిని విడిచి పెట్టేంత వరకు ట్యాంక్బండ్పై నుంచి కదిలేది లేదని తెలంగాణ వాదులు బైఠాయించారు.