హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెచ్చిపోయిన తెలంగాణవాదులు: అన్నమయ్య విగ్రహం ధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Annamayya Statue
హైదరాబాద్: మిలియన్ మార్చ్ సందర్భంగా టాంక్‌బండ్ చేరుకున్న పలువురు తెలంగాణవాదులు రెచ్చిపోయారు. పలువురు విధ్వంసాన్ని సృష్టించారు. పలువురు తెలంగాణవాదులు తెలంగాణకు అనుకూలంగా, సీమాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెళ్లి అక్కడే ఉన్న అన్నమయ్య, ఎర్రాప్రగడ విగ్రహాలను ధ్వంసం చేశారు. అయితే మరికొన్ని విగ్రహాలను కూడా ధ్వంసం చేయడానికి ఆందోళనకారులు సిద్ధపడ్డారు. ఈ దశలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా అంతకుముందే లోయర్ టాంక్‌బండ్‌లో డిసిపి అకున్ సబర్వాల్ వాహనాన్ని దగ్ధం చేశారు. మిలియన్ మార్చ్‌లో తెలంగాణవాదులు తెలంగాణకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

మరికొన్ని విగ్రహాలు పాక్షికంగా ధ్వంసం అయినట్టుగా తెలుస్తోంది. ఈ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టుగా తెలిస్తోంది. ట్యాంక్‌బండ్‌పై వున్న కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, పింగిళి వెంకయ్య, శ్రీకృష్ణదేవరాయలు, త్రిపురనేని రామస్వామి చౌదరి, మొల్ల విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్న ఓ ఛానెల్‌ కెమెరామెన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో కెమెరా ధ్వంసం కాగా, కెమెరామెన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.

బషీర్ బాగ్ వద్ద భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు, తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అరెస్టు చేశారు. పలుచోట్ల పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు తెలంగాణవాదులు చేయగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకన్నారు.

English summary
Telanganites destroyed Annamayya statue today in million march. They destoyed many more statue which are put on 
 
 tankbund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X