విగ్రహాల ధ్వంసంపై కోదండరామ్ సమాధానం చెప్పాలి: సీమాంధ్ర టిడిపి
విగ్రహాల ధ్వంసానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగు జాతికి అవమానకరమైన రీతిలో విగ్రహాల ధ్వంసం జరిగినందుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ తెలుగు వారికి వివరణ ఇవ్వాలన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పి తెలుగు జాతిని కించపర్చే విధంగా ప్రవర్తించినందుకు కోదండరామ్ సమాధానం చెప్పాలని అన్నారు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికే ముందస్తు పథకంతో విగ్రహాలను ధ్వంసం చేశారని అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడంతో పాటు వారి విధ్వంసాన్ని చిత్రీకరిస్తున్న కెమెరామెన్పై కూడా దాడి చేశారని ఆరోపించారు. విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా హేయమైన చర్యగా అభివర్ణించారు.
Comments
devineni umamaheswara rao kodandaram telangana hyderabad కోదండరామ్ తెలంగాణ హైదరాబాద్ దేవినేని ఉమా మహేశ్వర రావు
English summary
Seemandhra TDP MLA Devineni Uma questioned Telangana Political JAC convenor Kodandaram today on statues destroyed on tank bund.
Story first published: Friday, March 11, 2011, 11:12 [IST]