చిదంబరం ప్రకటన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ బలపడింది: విహెచ్

కాగా హోంమంత్రి చిదంబరంతో తెలంగాణ ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల్లో ప్రస్తుతం నిరాశ నెలకొని ఉందని తాము చిదంబరానికి వివరించామని చెప్పారు. 14 ఎఫ్ నిబంధనను తొలగించాలని ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలోనే రెండోసారి అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చిదంబరం చెప్పారన్నారు. తమకు ఉద్యోగుల సమస్యకంటే తెలంగాణ ఏర్పాటే ముఖ్యమన్నారు.












Click it and Unblock the Notifications