హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జై తెలంగాణ అంటూ మోసం: పొంగులేటికి నాగం కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రెండు సెకన్లు అసెంబ్లీలో జై తెలంగాణ అని నినాదాలు చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. తనపై ఎమ్మెల్సీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతున్నందుకే నాపై పొంగులేటి విమర్శలు చేశారన్నారు. తెలంగాణ కోసం సభను బహిష్కరిస్తున్నామని చెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు సభకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు.

ఏం సాధించారని వారు సభకు వెళుతున్నారన్నారు. తెలంగాణ ఇస్తామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ గానీ, ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికార పక్షంలో ఉండి తెలంగాణ విషయంలో ఏం సాధించారని సభకు వెళుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అందరం కలిసి పోరాడాల్సి ఉంటుందన్నారు. అందరూ కలిసి రాకపోతే ప్రజలు క్షమించరన్నారు.

పిఏసి చైర్మన్‌గా ఉండి తాను ఏమీ చేయలేదని పొంగులేటి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈపీసిలో 2400 రూపాయల అక్రమాలు జరిగాయని, అయితే మరికాస్త ఇన్‌ఫర్మేషన్ కావాల్సి ఉన్నందువల్ల అది ఆలస్యం అయిందన్నారు. దానిని త్వరలో బయటపెడతానని చెప్పారు.

English summary
TDP senior MLA Nagam Janardhan Reddy gave counter to Congress MLC Ponguleti Sudhakar Reddy today. He questioned about congress MLAs attitude. He suggest them to fight along with all parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X