హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధేయ మార్గంలో కమ్యూనిస్టు నేత బివి రాఘవులు, దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నేత గాంధేయ మార్గంలో పయనిస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు గురువారం నిరవధిక దీక్షను ప్రారంభించారు. ప్రజాసమస్యలపై ఆయన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద దీక్షను చేపట్టారు. ఆయనతో పాటు మరో ముగ్గురు పార్టీ నాయకులు ఎస్ వీరయ్య, నాగయ్య, మిడియం బాబూరావు కూడా దీక్షకు కూర్చున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఈ దీక్షను ప్రారంభించారు. యాభై డిమాండ్లతో రాఘవులు దీక్షకు కూర్చున్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

ప్రభుత్వానికి యాభై డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చామని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. అధికార కాంగ్రెసు పార్టీ కుమ్ములాటలో కూరుకుపోయి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. దళితులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను చర్చించే వేదిక లేకుండా పోయిందని ఆయన అన్నారు.

English summary
CPM state secretary BV Raghavulu began his indefinite fast today, demanding solve public issue. party leaders S Veeraiah, Nagaih and Babu Rao are on fast along with Raghavulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X