హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీకి పిండ ప్రదానం: బిజెపి, టిఆర్ఎస్ దూరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఏసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు మేరకు సికింద్రాబాద్‌లోని జెబిఎస్ పరిసరాల్లో తెలంగాణ జెఏసి అసెంబ్లీ పిండ ప్రధానం కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జెఏసి కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, డాక్టర్స్ జెఏసి చైర్మన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ విషయం చర్చకు రావడం లేదని అందుకే పిండ ప్రధాన కార్యక్రమం చేపట్టమన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనుకుంటే 2004లోనే వచ్చేదన్నారు. గత డిసెంబర్ 9న కూడా తెలంగాణ ఇస్తానని సాక్షాత్తూ కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారన్నారు. వారే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. తెలంగాణ వారు ఎక్కడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కూడా తమతో కలిసి రావాలని కోరారు. తెలంగాణ సమస్యపై చర్చించకుండా అసెంబ్లీ నిర్జీవంగా ఉందన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ పిండ ప్రధాన కార్యక్రమానికి బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

English summary
Telangana JAC organiged today assembly last virtual today in hyderabad. They demanded to Telangana. They blamed central government on telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X