హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్, చంద్రబాబుల మధ్య భూకేటాయింపుల వాగ్యుద్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చోటు చేసుకున్న భూకేటాయింపులపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. భూకేటాయింపు ప్రకంపనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మధ్య తీవ్ర వాదనలు జరిగిన అనంతరం ముఖ్యమంత్రి వాటిపై సోమవారం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. భూ కేటాయింపులు ముడుపులు తీసుకొని కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. భూకేటాయింపులపై ప్రభుత్వం వెంటనే సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు.

కేటాయింపులపై జెఎల్‌పి వేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. ఈ వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రస్తుతం అన్ని చట్టసభలు అవినీతిపై చర్చిస్తున్నాయని చెప్పారు. భూ కేటాయింపుల వెనుక పెద్దల హస్తం ఉందన్నారు. కేటాయింపులలో అవకతవకలు చాలా ఉన్నాయన్నారు. భూ కేటాయింపుల అక్రమాల వలన వేలకోట్ల ప్రభుత్వ ధనం వృధా అయిందన్నారు. ముడుపులు తీసుకొని అప్పుడు ప్రభుత్వం భూకేటాయింపులు జరిపిందన్నారు.

కాగా ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఆరోపణలకు ప్రభుత్వం స్పందించింది. భూ కేటాయింపుల వివరాలను సోమవారం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్షాల సలహాలను తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. భూ కేటాయింపుల విధానాన్ని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం స్పీకరు నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

English summary
Land allocation allegations comments took very serious talks between ruling and opposition party. TDP president Chandrababu demand to JLP on land allocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X