పశ్చిమ బెంగాల్ సీట్ల సర్దుబాటుపై మమతతో కాంగ్రెసు రాజీ
National
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ:
పశ్చిమ
బెంగాల్
శాసనసభ
ఎన్నికల
సీట్ల
సర్దుబాటు
విషయంలో
కాంగ్రెసు,
తృణమూల్
కాంగ్రెసు
ఓ
అంగీకారానికి
వచ్చినట్లు
తెలుస్తోంది.
రెండు
పార్టీలు
పట్టువిడుపులు
ప్రదర్శించాయి.
కాంగ్రెసు
పార్టీ
65
సీట్లకు
పోటీ
చేయడానికి
అంగీకరించినట్లు
తెలుస్తోంది.
కాంగ్రెసు
పార్టీ
వంద
సీట్లు
అడగ్గా,
60
సీట్లు
కేటాయించడానికి
తృణమూల్
కాంగ్రెసు
నేత
మమతా
బెనర్జీ
ముందుకు
వచ్చారు.
పైగా,
228
స్థానాలకు
మమతా
బెనర్జీ
ఏకపక్షంగా
అభ్యర్థులను
ప్రకటించారు.
దీంతో
సీట్ల
సర్దుబాటులో
ప్రతిష్టంభన
ఏర్పడింది.
అంతకు
ముందు,
పశ్చిమ
బెంగాల్
శాసనసభ
ఎన్నికల్లో
మమతా
బెనర్జీ
నాయకత్వంలోని
తృణమూల్
కాంగ్రెసు
పార్టీతో
కాంగ్రెసు
సీట్ల
సర్దుబాటు
కొలిక్కి
రాలేదు.
మమతా
బెనర్జీ
సీట్ల
విషయంలో
మొండికేస్తుండడంతో
రాష్టంలోని
294
సీట్లకు
పోటీ
చేయడానికి
సిద్ధపడుతోంది.
దీనిపై
కాంగ్రెసు
అధ్యక్షురాలు
సోనియా
గాంధీ
తుది
నిర్ణయం
తీసుకుంటారు.
పశ్చిమ
బెంగాల్
పార్టీ
వ్యవహారాల
ఇంచార్జీ
అహ్మద్
పటేల్
ఈ
విషయంలో
స్పష్టమైన
సూచన
ఇచ్చారు.
తాము
మూడు
జాబితాలు
తయారు
చేస్తున్నామని,
64
సీట్లకు,
90
సీట్లకు,
294
సీట్లకు
పోటీ
చేసేందుకు
మూడు
జాబితాలను
రూపొందిస్తున్నామని,
రాజకీయ
పార్టీగా
అన్ని
సీట్లకు
తమ
అభ్యర్థులుండాలని
ఆయన
సోమవారం
మీడియా
ప్రతినిధులతో
చెప్పారు.
అయితే,
తృణమూల్తో
పొత్తు
కుదరాలని
తాము
భావిస్తున్నట్లు
ఆయన
తెలిపారు.
అయితే,
పార్టీ
అధిష్టానం
నిర్ణయానికి
తాము
తలొగ్గుతామని
ఆయన
చెప్పారు.
With a stalemate in its alliance with Trinamool Congress for West Bengal assembly elections, Congress is preparing to contest all the 294 seats in the state. But it is learnt that Congress has accepted for 65 seats.
Story first published: Monday, March 21, 2011, 16:36 [IST]