వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుతో కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్: ఎర్రబెల్లి దయాకర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కాంగ్రెసు పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలంగాణ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మంగళవారం న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు. కాంగ్రెసుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న కారణంగానే ఆయన న్యూఢిల్లీకి రావడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటును స్తంభింపజేస్తామని పలికిన కెసిఆర్ ఇప్పుడు ఢిల్లీకి మాత్రం రావడం లేదన్నారు. అందరూ కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చునని చెప్పారు.

టిఆర్ఎస్ ఎంపీలు కెసిఆర్, విజయశాంతి ఢిల్లీకి వచ్చి తెలంగాణ కోసం పార్లమెంటును స్తంభింపజేయాలని సూచించారు. అప్పుడే తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. కానీ వారు మాత్రం హైదరాబాదులోకూర్చుని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌లను కలిసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లారు.

English summary
TDP senior MLA Errabelli Dayakar Rao said today that TRS president K Chandrasekhar Rao make match fixing with congress party. He questioned why KCR not obstructing parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X