కడపలో బాబాయ్ వివేకాకు షాక్: జగన్ వర్గం అభ్యర్థి విజయం

జగన్ వర్గం అభ్యర్థి నారాయణ రెడ్డి ఓటమికి మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ కడప జిల్లాలోనే మకాం వేసి వ్యూహరచన చేసి అమలు చేశారు. అయినా ఫలితం సాధించలేకపోయారు. కాగా, కాంగ్రెసు పార్టీ నాయకులు రీకౌంటింగ్కు డిమాండ్ చేస్తున్నారు. అందుకు జగన్ వర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఒక్కటై, ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగడంతో జగన్ వర్గం అభ్యర్థి ఓడిపోతారని భావించారు. అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ, స్పల్ప ఆధిక్యతతో జగన్ వర్గం అభ్యర్థి బయటపడ్డారు.












Click it and Unblock the Notifications