వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎకె ఆంటోనీకి ఫోన్ చేసి మాట్లాడిన కె. చంద్రశేఖర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఆంటోనీతో ఆయన ఏం మాట్లాడిందీ తెలియరాలేదు. అయితే ఏప్రిల్ 27వ తేదీన సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్‌లో తాము తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి వచ్చేలా చూడాలని ఆయన ఆంటోనీని కోరినట్లు తెలుస్తోంది. కాగా, తెరాస మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ ఆంటోనీని కలిశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తాము తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇప్పించాలని ఆయన ఆంటోనీని కోరారు.

ఏప్రిల్ 27వ తేదీ తెరాస ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఆంటోనీకి ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.

English summary
TRS president K Chandrasekhar spoke with defence minister AK Antony on telephone. It is said that KCR has appealed to AK Antony for permission to conduct public meeting on april 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X