ఐదుగురు వైయస్ జగన్ క్యాంప్ శాసనసభ్యులపై చర్యలకు రెడీ?

కడప జిల్లా నాయకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కమలమ్మ, అమర్నాథ్ రెడ్డి, కె. శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా కరుడు గట్టిన ఈ ఐదుగురు జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటే మిగతా వారు సర్దుకుంటారని, సర్దుకోకపోతే తదుపరి చర్యలు తీసుకోవచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పద్ధతిలో జగన్ వర్గం శాసనసభ్యులు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోకపోతే మిగతా వారికి కూడా అవకాశం కల్పించినట్లు అవుతుందని ఇటీవల జరిగిన కడప జిల్లా సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications