హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీరావు సుప్రీంకోర్టును మోసం చేశారు: జగన్ వర్గం నేత గట్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gattu Ramachandra Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నాయకుడు గట్టు రామచంద్రారావు ఆదివారం ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామోజీరావు రాజకీయ గురువింద అన్నారు. రామోజీ సుప్రీంకోర్టును మోసం చేశారని ఆరోపించారు. రామోజీ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ఎందుకు సైలెంట్‌గా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో భూకేటాయింపులపై ప్రతిపక్షాలు ఎందుకు విచారణ కోరడం లేదన్నారు. ప్రతిపక్షాలది ద్వంద వైఖరి అన్నారు.

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయిందని మరో నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు. ప్రతిపక్ష పార్టీ సభలో ప్రజా సమస్యలను ఏమాత్రం లేవనెత్తడం లేదన్నారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉందా అని ఆయన ప్రశ్నించారు. వరంగల్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

English summary
YSR Congress Party leader Gattu Ramachandra Rao accused Ramoji Rao attitude today. He said Ramoji was crossed supreme court in his income. He also questioned IT about Ramoji's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X