దుమ్మెత్తిపోసుకోవడం సరి కాదు: భూకేటాయింపులపై రఘువీరా రెడ్డి

భూముల కేటాయింపుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం గానీ తమ ప్రభుత్వం గానీ హేతబద్దతను పాటించలేదని, ఏ పరిశ్రమకు ఎంత భూమి కేటాయించాలనే నిబంధనలను రూపొందించుకోలేదని ఆయన అన్నారు. ఓ విండ్ పవర్ మిల్లుకు 13 ఎకరాలు కేటాయించిన సందర్భాలున్నాయని, తీరా చూస్తే విండ్ పవర్ మిల్లుకు మూడు నుంచి మూడున్నర ఎకరాలు సరిపోతుందని ఆయన అన్నారు. నియమ నిబంధలను రూపొందించుకోకపోవడం వల్ల, శాస్త్రీయంగా చూడకపోవడం వల్ల భూకేటాయింపుల్లో హేతుబద్దత లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications