రాజధాని పుకార్లతో విజయవాడ చుట్టుపక్కల రియల్ బూమ్
రాజధాని వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడంతో రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినట్లు తెలుస్తోంది. విజయనగరం పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యులు కొంత మంది పెద్ద యెత్తున భూములు కొనేసినట్లు టీవీ చానెల్ తెలిపింది. మైలవరం ప్రాంతంలోని భూములకు పెద్ద యెత్తున ధరలు పలుకుతున్నాయని అంటున్నారు. విజయవాడ చట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు చుక్కలను అంటుతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ, దాని చుట్టుపక్కల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాజధాని ఊహాగానాలకు ఊతమిస్తోందని అంటున్నారు. విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ఈ పథకాల అమలు రాజధాని ఏర్పాటు కోసమేనని ప్రచారం సాగుతోంది.
Comments
English summary
According to a Telugu news channel - real estate business is picked up around Vijayawada city and between Vijayawada and Nuziveedu, as the rumour is spreading that Seemandhra capital will be established near Vijayawada.
Story first published: Thursday, March 31, 2011, 17:56 [IST]