అవినీతిపై పోరు, ఢిల్లీలో అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష

హజారేకు మద్దతుగా స్వామి అగ్నివేశ్, కిరణ్ బేడీ, సందీప్ పాండే కూడా అక్కడికి చేరుకున్నారు. జన్ లోక్పాల్ బిల్లు ముసాయిదా తయారీకి సీనియర్ మంత్రులతో వేసిన కమిటీలో పౌర సమాజం ప్రముఖులను చేర్చాలనే తన డిమాండ్ను ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. రిటైర్డ్ జస్టిస్ సంతోష్ హెగ్డే, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అగ్నివేష్ వంటి ప్రముఖుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మహారాష్ట్రలో భారీ భూములు ఉన్న శరద్ పవార్ వంటి మంత్రి ఆ కమిటీకి నేతృత్వం వహించడం విచారకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications