సిఎంతో సమావేశం అనంతరం పోటీపై మనసు మార్చుకున్న కందుల!

ఈ నేపథ్యంలో రాజమోహన్ రెడ్డి పోటీకి వెనక్కి తగ్గారు. పోటీపై పునరాలోచించారు. అయితే జిల్లా మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు కందులను బుజ్జగించారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కందుల బ్రదర్స్ భేటీ ఆయ్యారు. ఈ భేటీలో వారితో పాటు జిల్లా మంత్రులు పాల్గొన్నారు. మంత్రుల బుజ్జగింపుతో, సిఎం కిరణ్తో మాట్లాడిన అనంతరం కందుల జగన్పై పోటీకి మళ్లీ సై అన్నారని తెలుస్తోంది. మంత్రుల బుజ్జగింపు కారణంగా కందుల పోటీకి సై అన్నారని, ముఖ్యమంత్రితో ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
అధిష్టానానికి పోటీ చేస్తున్న వారి పేర్లు కూడా పంపించినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యంగా కందుల రాజమోహన్ రెడ్డి, తర్వాత వరదరాజులు రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. కందుల కాంగ్రెసులోకి రాకముందు వరదరాజులు రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి పేర్లు వినిపించినప్పటికీ డిఎల్ పోటీకి సిద్ధంగా లేరని తెలుస్తోంది. టిడిపిలో ఉన్నప్పుడు దివంగత వైయస్తో పోటీ పడి ఆయనను ఓటమికి దగ్గరగా తీసుకు వచ్చిన కందులకు జిల్లాలో మంచి బలం ఉందనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు కందుల వైపు మొగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా కందుల మాత్రం పోటీకి సిద్ధంగా లేరనే వాదన కూడా వినిపిస్తోంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications