హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కే కీలకం, మాకు కాదు: మంత్రి బొత్స సత్యనారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌కే కీలకమని, కాంగ్రెసు పార్టీకి కాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోయినా ప్రభావం ఏమీ ఉండదని, ఉపద్రవాలు ఏవీ రావని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన చెప్పారు. అయితే ఈ ఎన్నికలు జగన్‌కు కీలకమని చెప్పారు. టీడీపీ, ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చి ఉప ఎన్నికల్లో పోటీకి నిలపాల్సిన ఖర్మ తమ పార్టీకి పట్టలేదన్నారు. వైఎస్ ప్రజా నాయకుడని, ఆయన ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కడప మాజీ ఎంపీ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాపై వైఎస్ ఫోటోను వాడడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న అంశాన్ని ప్రస్తావించగా, ఆయన పై విధంగా స్పందించారు.

English summary
Transport minister Botsa Satyanarayana said that bypolls are important for YS Jagan not for Congress. He said that the results will not affect Congress government in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X