కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల రవి హత్యకు జగన్ రూ.5 లక్షలు ఇచ్చాడు: డిఎల్ వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప /ఒంగోలు: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవిని అంతం చేసేందుకు మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగలి కృష్ణకు 5 లక్షల రూపాయలు ఇచ్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సోమవారం ఓ సమావేశంలో అన్నట్టుగా సమాచారం. జగన్ వెంట ఉన్న వారంతా అక్రమాలు, క్రిమినల్స్ చేసే నేరగాళ్లు ఉన్నారని ఆరోపించారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మంగలి కృష్ణలపై పులివెందులలో క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు.

కాగా కాంగ్రెసు పార్టీపై జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో విమర్శలు చేశారు. జగన్‌ను ఎదుర్కొనడానికి కాంగ్రెసు పార్టీ 15 మంది మంత్రులను కడప జిల్లాలో తిష్ట వేయించిందన్నారు. అయినప్పటికీ గెలుపు మాత్రం జగన్‌, విజయమ్మలదే అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రూ.150 కోట్లు కడపకు మళ్లించారని ఆరోపించారు.

English summary
Minister DL Ravindra Reddy alleged today that Ex MP YS Jaganmohan Reddy gave Rs. 5 lack to Mangali Krishna for Paritala Ravi murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X