వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధకొడాకు చెందిన రూ. 130 కోట్ల విలువ చేసే అస్తుల జప్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Koda
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడా అస్తుల జప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రంగం సిద్ధం చేసుకుంది. మధు కొడాకు, ఆయన అనుచరులకు చెందిన దాదాపు 130 కోట్ల ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు చేసేందుకు సంబంధిత అధికార యంత్రాంగం నుంచి ఇడి అనుమతి పొందింది. మధు కొడా, ఆయన అనుచరులు అక్రమ పెట్టుబడులకు, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మధు కొడా ఆస్తుల జప్తునకు సంబంధించిన మొదటి ఆదేశాలను ఇడి అందుకున్నట్లు తెలుస్తోంది. మధు కొడాకు, అతని అనుచరులకు 200 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అస్తులున్నట్లు ఇడి గుర్తించింది. అందువల్ల మలి విడత ఇతర మరిన్ని ఆస్తుల జప్తునకు ఇడి ఆదేశాలు పొందవచ్చునని తెలుస్తోంది.

మధు కొడా, ఆయన అనుచరులకు చెందిన ఆస్తులు చాలా వరకు జార్ఖండ్‌లోనూ, బీహార్‌లోనూ ఉన్నాయి. ఆ ఆస్తులను సీల్ చేసి, వాటి క్రయవిక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. కొడా అనుచరులు బినోద్, వికాస్ సిన్హా వంటివారి ఆస్తులను కూడా ఇడి జప్తు చేయనుంది.

English summary
The Enforcement Directorate is all set to attach properties worth Rs 130 crore allegedly belonging to former Jharkhand Chief Minister Madhu Koda and his aides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X