చంద్రబాబుకు నాగం జనార్దన్ రెడ్డి షాక్, కడప ప్రచారానికి నో

Nagam Janardhan Reddy-Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలుగదేశం పార్టీ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి మరోసారి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని చంద్రబాబు జారీ చేసిన ఆదేశాలను ఆయన తిరస్కరించారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేది లేదని ఆయన తేల్చి చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్న పార్టీ కడప లోకసభ అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డికి తాము ఎలా ప్రచారం చేస్తామని ఆయన ప్రశ్నించారు. కడప ప్రచారానికి వెళ్లవద్దని ఇతర తెలంగాణ నేతలతో కూడా చెప్పినట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

కడప ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని నాగం జనార్దనరెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉన్నందునే వెళ్లడం లేదని చెప్పారు. మనసులో దురాలోచనలు పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు యాగం చేస్తే ఫలితం ఉండదని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే ప్రభుత్వం 177 జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో సీమాంధ్ర నాయకులు ప్రచారం చేయలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నేతలు కడపలో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని నాగం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+