చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయిబాబా స్థితిపై ఆదికేశవులు నాయుడు సంచలన వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Adikesavulu Naidu
చిత్తూరు: పుట్టపర్తి సత్య సాయిబాబా ప్రస్తుత స్థితిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయిబాబాకు ద్రోహం జరిగిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సత్య సాయిబాబా ప్రస్తుత స్థితికి ఆయన సహాయకుడు సత్యజిత్ కారణమని ఆయన ఆరోపించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాబా వద్ద ఉన్న అయ్యర్ వైద్యుడు కాడని, అతను సత్యజిత్ స్నేహితుడని, సత్య సాయిబాబా వద్ద వైద్యులే లేరని ఆయన అన్నారు. సత్య సాయిబాబాకు విదేశాల్లో వైద్యం చేయించవచ్చునని ఆయన అన్నారు. సత్య సాయిబాబాకు ఆహారం, వైద్యం అందిస్తే తప్ప కోలుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

సత్య సాయిబాబాను ఆరు నెలలుగా సత్యజిత్ దర్శంచకుండా చేశారని ఆయన ఆరోపించారు. పూర్తి వాస్తవాలు తెలియకుండా మాట్లాడితే బాగుండదని ఇంత కాలం తాను మౌనంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. మంత్రి గీతా రెడ్డికి వాస్తవాలు తెలుసునని, గీతా రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యం బాగా లేకున్నా సత్యజిత్ చికిత్స చేయించలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి, ట్రస్టుకు వాస్తవాలు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రత్నాకర్ లాంటి వ్యక్తులు సత్య సాయిబాబా స్థితిపై నోరు విప్పాలని ఆయన అన్నారు.

English summary
TTD former chairman Adikesavulu Naidu accused Satyajit for Sathya Saibaba's present condition. He said that Government is not reacting on Baba's condition, even though facts are known.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X