కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ సమాధి వద్ద కన్నీళ్లు పెట్టిన వైయస్ విజయమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
కడప: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఆయన సతీమణి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పులివెందుల అభ్యర్థి వైయస్ విజయమ్మ కన్నీళ్లు పెట్టారు. కడప లోకసభ స్థానానికి నామినేషన్ వేసే ముందు వైయస్ జగన్ తండ్రి వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. జగన్ నామినేషన్ పత్రాలను ఆమె వైయస్సార్ సమాధిపై ఉంచి ఆ తర్వాత జగన్‌కు అందించారు. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జగన్ వైయస్సార్ సమాధికి నివాళులు అర్పించారు.

తండ్రి వైయస్సార్‌కు నివాళులు అర్పించిన తర్వాత వైయస్ జగన్ నామినేషన్ వేసేందుకు కడప బయలుదేరారు. నామినేషన్ సందర్భంగా హంగామా ఉండకూడదని జగన్ భావిస్తున్నారు. దీంతో సాదాసీదాగానే కడప జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. కడప లోకసభ స్థానంలో ఇప్పటికే వైయస్ జగన్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైయస్ విజయమ్మ పులివెందుల శాసనసభ స్థానంలో ఓటర్లను కలుస్తూ తనను గెలిపించాలని అడుగుతున్నారు.

English summary
YS Vijayamma wept at YSR ghat at Pulivendula. She payed homage to YSR along with YS Jagan and other family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X