హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితారెడ్డి, జైపాల్‌రెడ్డిపై కోడిగుడ్ల దాడి: మంత్రుల సభలో లేచిన కుర్చీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రి సబితారెడ్డి, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కాన్వాయ్‌పై ఆదివారం పలువురు తెలంగాణవాదులు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట మండలం గంగ్యాడ గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళుతున్న మంత్రుల కాన్వాయ్‌పై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. సబితారెడ్డి, జైపాల్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ నినదించారు.

గ్రామంలో సభ జరుగుతుండగా ఈ దాడి జరిగింది. జైపాల్ రెడ్డిని కదలనివ్వం అని తెలంగాణ విద్యార్థి సంఘాల నేతలు పట్టుపట్టారు. ఎవరి అనుమతి తీసుకొని గ్రామంలోకి వచ్చారని వారిని నిలదీశారు. తెలంగాణవాదులతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మంత్రులను నిలదీయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వాదుల తెలంగాణ డిమాండుకు తోడు ఏడాది తర్వాత తమ వద్దకు రావడంపై కాంగ్రెసు నేతలు ప్రశ్నించారు. అయితే కాంగ్రెసులో రెండు వర్గాలు ఉండటం వల్ల ఓ వర్గానికి చెందిన వారు మంత్రులను నిలదీసినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఇరువర్గాల మధ్య వివాదం జరిగింది. ఇరువర్గాలు కుర్చీలు ఒకరిపై మరొకరు విసురుకున్నారు. సుమారు అయిదు వందల మంది పోలీసుల భద్రతలో ఉన్న మంత్రులు వారిని వారించడానికి ప్రయత్నాలు చేశారు. పోలీసులు, మంత్రుల జోక్యంతో చివరకు గొడవ సద్దుమణిగింది.

English summary
Telanganites through eggs on miniser Sabitha Indra Reddy and Jaipal Reddy today in Rangareddy district. JAC leaders gave slogans against ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X