రూ.3 లక్షలు ఇవ్వనందుకు మృదుల హత్య: వీడిన మర్డర్ మిస్టరీ
అయితే శివ తన అప్పును తీర్చడం కోసం హత్యకు మూడు రోజుల ముందు మృదుల తల్లిదండ్రులను సందర్భంలో రూ.3 లక్షల రూపాయలు కావాలని అడిగాడు. అయితే వారు అందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన శివ మరో ముగ్గురు కిరాయి రౌడీలతో కలిసి మృదుల ఇంటికి దొంగతానికి వచ్చాడు. అయితే ఇంట్లో మృదుల ఒక్కతే ఉంది. ఆ సమయంలో ఆమెపై క్లోరోఫాం చల్లి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసి ఇంట్లో ఏమైనా డబ్బులు ఉంటాయో అంతా వెతికాడు. మృదుల తండ్రి పెట్రోలు బంకు యజమాని. పెట్రోలు బంకులో పని చేస్తున్న వ్యక్తి వస్తున్నట్టు గమనించిన శివ ఆ ముగ్గురితో కలిసి పారిపోయాడు.
ఈ హత్య కేసును విశాఖపట్నం పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఛేదించారు. ఇప్పటికే నగరంలో వరుసగా అమ్మాయిలపై జరుగుతున్న దాడుల సమయంలో మృదుల హత్య జరగడంతో వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీంతో విశాఖ సిపి ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసు మిస్టరీని ఛేదించడం కోసం నాలుగు టీంలను రంగంలకి దింపారు.