జగన్ పార్టీపై కాంగ్రెసు ఫిర్యాదు, వైయస్ బొమ్మ మాదేనని వినతి

కడప ఉపఎన్నికలపై వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్ట ఆధారపడి ఉందని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైఎస్ ఎప్పటికీ కాంగ్రెస్ వారసుడేనని, జగన్కేవలం వైఎస్ ఆస్తికి మాత్రమే వారసుడని ఆయన శనివారం కడపలో అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వేలకోట్లు సంపాదించిన జగన్ ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచారని అన్నారు. ప్రజలను విస్మరించి బెంగుళూరులో ఉండే వ్యక్తిని జనం క్షమించరని అన్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తులకే ఓటేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications