హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ వివేకాకు మహిళా మంత్రుల షాక్, విజయమ్మపై ప్రచారానికి నో

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్: పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డికి మహిళా మంత్రులు షాక్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారానికి మహిళా మంత్రులను పులివెందులలో దించాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం కూడా బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయలేమనే కన్నా వైయస్ విజయమ్మకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేమని వారు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పినట్లు సమాచారం. విజయమ్మకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తమ పట్ల వ్యతిరేకత ఎదురవుతుందని వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా, మహిళా మంత్రులు చాలా మంది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే రాజకీయాల్లో ప్రధాన పోషించగలుగుతున్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వంటి మహిళా మంత్రులకు రాజశేఖర రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వైయస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కూడా వారిని వెనక్కి లాగుతున్నట్లు చెబుతున్నారు. వైయస్ విజయమ్మతో మహిళా మంత్రులకు చాలా మందికి దగ్గరితనం ఉంది. అందువల్ల ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తమ వల్ల కాదని అంటున్నట్లు తెలుస్తోంది.

English summary
It is learnt that Woman ministers have rejected to campaign against YS Vijayamma in Pulivendula assembly bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X