సత్య సాయి బాబా అంతిమ సంస్కారాల తర్వాత ట్రస్టు కీలక భేటీ

బుధవారం జరిగే సమావేశంలో ట్రస్టు సభ్యులతో పాటు సత్య సాయిబాబా కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. ఇరు పక్షాల మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశానికి ప్రాధాన్యం చేకూరింది. సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ను ట్రస్టులోకి తీసుకోవాలా, వద్దా అనే విషయంపై కూడా సమావేశంలో చర్చ జరుగుతుంది. ట్రస్టులో సత్యజిత్కు కీలక బాధ్యతలు లభిస్తాయని బాబా నిరుడు ప్రకటించినట్లు చెబుతున్నారు.
బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సత్యజిత్ పట్ల కొంత మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రస్టు కార్యదర్శి చక్రవర్తికి చెక్లపై సంతకాలు పెట్టే హక్కు ఉంది. అయితే, సత్య సాయిబాబా జీవించి ఉన్నంత వరకు ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకోలేదు. సత్య సాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ట్రస్టు సభ్యుడిగా ఉన్నారు. ఆయన పాత్ర భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది కూడా తేలే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications