వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా జిల్లా హోటల్లో విషాహారం తిని ముగ్గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakasam Barriage
విజయవాడ: కృష్ణా జిల్లాలో మంగళవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నూజివీడు మండలం మీర్జాపూర్‌లోని నాగమణి హోటల్లో విషాహారం తిని ముగ్గురు మరణించారు. మరో పది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైనవారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్వస్థకు గురైనవారికి విజయవాడ, నూజివీడు, ఏలూరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

మీర్జాపూర్‌లోని నాగమణి హోటల్లో వారంతా ఉదయం పూట పూరీ తిన్నారు. అది విషంగా మారడంతో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో వరలక్ష్మి (18), స్రవంతి (8) ఉన్నారు. వరలక్ష్మి అనే మహిళ మీర్జాపూర్ హరిజనవాడ నివాసి. అధికారులు సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైనవారి సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంటుందని అంటున్నారు.

English summary
Three dead in Krishna district due to consumption of poisonous food in a hotel. Ten more are admitted in hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X